పబ్లిక్‌ గ్రీవెన్స్‌కు 26 వినతులు

May 5,2025 21:25

ప్రజాశక్తి- సీతంపేట: సీతంపేట ఐటిడిఎలో సోమవారం పిజిఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌కు 26 వినతలు వచ్చాయి. పిఒ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతులు స్వీకరించారు. మేడ ఒబ్బంగికి చెందిన సుబ్బారావు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. లాడకు చెందిన ప్రసాద్‌ సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయాలని, అనంతగిరికి చెందిన రామారావు జిసిసి ద్వారా కొండచీపుర్లు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇఇ రమాదేవి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, పిహెచ్‌ఒ గణేష్‌, సిడిపిఒ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.మున్సిపాలిటీ పై దష్టి సారించండిపార్వతీపురం టౌన్‌ : పార్వతీపురం మున్సిపాలిటీ పాలనపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలతతో కాంగ్రెస్‌ పార్టీ ఒబిసి పార్వతిపురం మన్యం జిల్లా చైర్మన్‌ వంగల దాలినాయుడు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం మున్సిపాలిటీ పరిపాలనపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేదన్నారు. బడ్జెట్‌ సమావేశం కూడా నిర్వహించ లేదన్నారు. దీంతో మున్సిపాలిటీలో ఆర్థికపరమైన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, మున్సిపల్‌ కమిషనర్ల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయన్నారు. వారిద్దరి మధ్య సమన్వయం కూడా మున్సిపల్‌ పాలనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా వారానికి ఒకరోజు కుళాయిలు రావడం జరుగుతుందనీ, దీని వల్ల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో చెత్త నుండి సంపద తయారీ జరగటం లేదని, చెత్త సాగ్రిగేషన్‌, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ తదితర కార్యక్రమాలు జరగటం లేదన్నారు. అవన్నీ జరిగేలా చర్యలు తీసుకొని, మున్సిపాలిటీలో పాలన సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆర్‌డిఒ హేమలత తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లను ఆదేశించారు.

➡️