పిజిఆర్‌ఎస్‌ కు 98 వినతులు

May 5,2025 21:31

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీఓపెన్‌ కారాదని అధికారులను కోరారు. కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ డాక్టర్‌ పి.ధర్మచంద్రా రెడ్ది భాగస్వామ్యమై 98 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యత గల ఎండార్స్‌ మెంట్‌ అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో వెలుగు, ఐసిడిఎస్‌ పీడీలు వై. సత్యంనాయుడు, డా.టి.కనక దుర్గ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహనరావు, జిల్లా బిసీ సంక్షేమ అధికారి ఇ.అప్పన్న, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఉదరు కిరణ్‌ కు లాప్‌ ట్యాప్‌ పంపిణీసాలూరు మండలం శివరాంపురానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు అల్లు ఉదరు కిరణ్‌కు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు రూ:33 వేలు విలువైన ల్యాప్‌ట్యాప్‌ను డిఆర్‌ఒ కె.హేమలత చేతుల మీదుగా సోమవారం పిజిఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో అందజేశారు. కడప జిల్లా డా:వై.యస్‌.ఆర్‌. ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న ఎ.ఉదరు కిరణ్‌ మూగ, చెవుడుతో బాధపడుతూ అభ్యసిస్తున్నాడు. తన చదువుకు, ఉపాధికి ల్యాప్‌ ట్యాప్‌ మంజూరు చేయాలని కోరగా, అతనికి సోమవారం ల్యాప్‌ ట్యాప్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ డా: పి.ధర్మారెడ్డి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ శ్రీరామ్మూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.ఎస్‌పి కార్యాలయంలో….పార్వతీపురం రూరల్‌ : ప్రజా సమస్య వేదిక ఫిర్యాదుదారులో వచ్చిన సమస్యలను చట్ట పరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వి మాధవ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డిసిఆర్బీ ఎస్సైలు ఫ్రకృద్దీన్‌, జగదీష్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️