ప్రజాశక్తి-పార్వతీపురం : విప్లవ జ్యోతి, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక కొనియాడారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అల్లూరి సీతారామరాజు వర్థంతిని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పోరాట పటిమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి.. విప్లవ జ్వాలను రగిలించిన మహా పోరాటయోధుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.కృష్ణవేణి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్.రాధాకృష్ణమూర్తి, పర్యవేక్షకులు శ్రీరామమూర్తి, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : సీతంపేట ఐటిడిఎలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎపిఒ జి.చిన్నబాబు, ఎఒ సునీల్, ఇతర అధికారులు నివాళులర్పించారు.బలిజిపేట : మండలంలో పెదపెంకిలో నేతాజీ గ్రంథాలయం వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఆ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవ నాయుడు నివాళర్పించారు. కార్యక్రమంలో యువత కోట గౌరీనాథ్, కోట చందు, తుమరాడ మురళి, మచ్చ సత్యంనాయుడు, గోపి, గౌరీ, తాతబాబు, వెంకట్ నాయుడు, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.విప్లవ జ్యోతి అల్లూరిసాలూరు రూరల్ : స్వాతంత్య్ర పోరాటంలో చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు ప్రాణాలను త్యాగం చేశారని మాజీ డిప్యూటీ సిఎం రాజన్న దొర తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును స్మరించే ప్రతి మనసులో ఆయన ఆశయం కలకాలం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.కొమరాడ : అల్లూరి సీతారామరాజు వర్థంతి సభను రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బల్లపాడు గ్రామంలో నిర్వహించారు. గిరిజన కళాకారుల నృత్య రూపకాలు, డప్పు డాన్సులతో ఆకట్టుకున్నారు. కమిటీ సభ్యులు కడ్రక వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టి జయంతి, వర్థంతి సభలు జరిపి గిరిజనుల ఓట్ల కోసం కొంతమంది నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీనునాయుడు, నాయకులు మోనంగి భాస్కరరావు, పి.అసిరి, హిమారిక విన్నారావు పాల్గొన్నారు. కురుపాం : జియ్యమ్మవలస మండలం టికె జమ్మూ గ్రామంలో ఎస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్థంతిని నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి సర్పంచ్ అడ్డాకుల భారతి పూలమాల లేసి నివాళులర్పించారు. ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గిరిజన యువత శంకరరావు, రాంప్రసాద్, కైలాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.గరుగుబిల్లి : మండల పరిధిలో నాగూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కొప్పల వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ఎ.మధు పూలమాల వేసి నివాళులర్పించారు.అల్లూరి స్ఫూర్తితో అడుగులు వేద్దాంపాచిపెంట : పాచిపెంట మండలం కేంద్రంలో బుధవారం ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఎస్.చిన్నారావు, రైతు ప్రతినిధి సురేష్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో ఎం.వసంతరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : కొమరాడ జూనియర్ కళాశాల సెంటర్ వద్ద అల్లూరి సీతా రామరాజు విగ్రహానికి సిపిఎం నాయకులు కె.సాంబమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
