ప్రజాశక్తి-సీతంపేట : గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం సీతంపేట మండలంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టారు. మల్లి గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.48 లక్షలతో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల ప్రహరీని ప్రారంభించారు. జిల్లేడుపాడులో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీని, పశువుల కోసం నీటి తొట్టెను ప్రారంభించారు. శంభం, వాభ గ్రామాల్లో పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్పర్సన్ బిడ్డిక సంధ్యారాణి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, ఐటిడిపి సీతంపేట కోఆర్డినేటర్ ఇమరక పవన్, ఇమరక ప్రసాద్, మల్లయ్య, జనసేన రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
