ప్రజాశక్తి – సాలూరు : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ముగ్గురు వ్యక్తులకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు, స్త్రీ, శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ముగ్గురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సాలూరు పట్టణానికి చెందిన రాపాక సూర్యకుమారికి రూ.35,569, తాళ్లాడ సుభద్రమ్మకు రూ.65,931, మండలంలోని నిహాల్కు చెందిన రూ.1,03,404 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో ఆదుకున్న మంత్రి సంధ్యారాణికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఆమదాల పరమేశు, కౌన్సిలర్ హర్షవర్ధన్, మండల నాయకులు గూడేపు యుంగధర్, నాయకులు పాల్గొన్నారు.
