ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు

May 5,2025 21:22

ప్రజాశక్తి – భామిని:  ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పాలకొండ ఎమ్మెలే నిమ్మక జయకృష్ణ అన్నారు. స్థానిక కెజిబివి ఆవరణలో రూ.225.50లక్షలతో కెజిబివి జూనియర్‌ కళాశాల అదనపు వసతులు నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యంతో భామినిలో అస్తవ్యస్తంగా వున్న భామిని-ఆలికాం ప్రధాన రహదారికి కూటమి ప్రభుత్వం రాగానే నిధులు కేటాయించి, రోడ్డు పనులు పూర్తి చేశామని తెలిపారు. దీంతో మండల ప్రజలు ప్రశాంతంగా రోడ్డుపై ప్రయాణం సాగిస్తున్నారని, ఈ అంశం చెప్పడానికి తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఘనసారా నుంచి కేసరి, కొసలి వరకు రూ.1.50 కోట్ల నాబార్డ్‌ నిధులతో తారు రోడ్డు మంజూరైం దన్నారు. గత టిడిపి ప్రభుత్వం హయాంలో 80 శాతం పూర్తి చేసిన కొండలోయ గెడ్డ రిజర్వాయర్‌ పనులను, కూటమి ప్రభుత్వంలో పూర్తి చేయాలని టిడిపి నాయకులు ఎమ్మెల్యేను కోరారు. స్థానికంగా చేపట్టవలసిన అభివృద్ధి అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసు కువెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్‌ సంధ్యారాణి, టిడిపి మండలి అధ్యక్షులు రవి నాయుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.జగదీశ్వరరావు, మాజీ ఎంపిపి భూపతి ఆనం దరావు, ఎంపిటిసి బి.విష్ణు, భామిని సర్పంచ్‌ ఎల్‌. రాజేశ్వరి, టిడిపి నాయకులు బిడ్డికి ప్రసాద్‌, కోరాడ రవణ, కోరాడ రాజేష్‌, కొల్ల మధు, నిమ్మల మురళి, కాంట్రాక్టర్‌ పొగిరి అర్జున్‌, జనసేన మండలి అధ్యక్షులు రుంకు కిరణ్‌ పాల్గొన్నారు. సీతంపేట: పట్టణంలో సమగ్రశిక్ష నిధులు రూ.212.02 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కెజిబివి జూనియర్‌ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జయకృష్ణ శంకుస్థాపనచ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి కోఆర్డినేటర్‌ ఇమరక పవన్‌, టిడిపి మండల అధ్యకుడు సవరతోట మోఖలింగం, జనసేన మండల అధ్యకుడు మండంగి విశ్వనాధం ప్రసాద్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️