సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో ఎపిడిమిక్ సీజన్ ప్రారంభం కాకముందే మన్యంలో మలేరియా వైరల్ పంజా విసిరింది. ప్రతి తండాలో వైరల్ మలేరియా కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఇటీవల కాలంలో ఎండలు తీవ్రంగా ఉండడం, వడగాల్పుల వేడి, అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు పడడం, కొత్తనీరు తాగడంతో ప్రతి ఇంట్లోనూ ఒకరో, ఇద్దరో జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైరల్ మలేరియా కేసులు రోజు రోజుకు నమోదవుతున్నాయి. ధోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాయకమ్మగూడ, కిల్లాడ, దేవనాపురం, ఘాటీ గుమ్మడ, పొల్ల, టిటికిపాయి, తదితర ప్రాంతాల్లో అధికంగా మలేరియా కేసులు ఉన్నాయి. కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కురిసింగి, అచ్చుబ, మర్రిపాడు ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎగువద్వారబంధం గ్రామాల్లో మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. ధోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజుకు 10 మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కుసిమి, మర్రిపాడు పిహెచ్సిల పరిధిలో వైరల్ జ్వరాలు ప్రతి పిహెచ్సిలో పదేసి 10 కేసులు నమోదవుతున్నాయి. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో మలేరియా కేసులు సుమారు రోజుకు 15 నుంచి 20 వరకు నమోదు అవుతున్నాయి. అయితే కాగుమానుగూడకు చెందిన సవర తిమ్మేసు, కోసంగి చెందిన బి.చంటి, కాగుమానుగూడ చెందిన జెర్సీ, మర్రిమానుగూడ చెందిన బిడ్డిక రమేష్ మలేరియాతో బాధపడుతూ శనివారం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మర్రిపాడు చెందిన గరికమ్మ, కురిసింగి చెందిన సిమ్మయ్యనాయుడు, మల్లి చెందిన అనిల్ స్థానిక ఏరియా ఆసుపత్రిలో మలేరియాతో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా రోగులకు ప్లేట్లెట్స్ తగ్గడంతో రక్తకణాలు క్షీణించిపోతున్నాయి. వీలైనంతంత వరకు వైద్యం పొందాలి. పిహెచ్సిలో అరకొరగా మలేరియా మందులుఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనికి తగ్గ మందుల్లేవని తెలుస్తుంది. ఆర్టిసి నెట్ టాబ్లెట్ అయితే పూర్తిగా లేదు. ఇక క్లోరోక్లిన,్ ప్రేమిక్లీన్ కేవలం 50 కిట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మందుల కోసం ఇండెంట్ కూడా తీసుకున్నారు. కేసులు పెరిగితే ఆ మందులు చాలవు. ఇక వైద్యులదే చేతి సమురు తగులుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రుల అభివృద్ధి నిధులు నిల్ ఆసుపత్రి అభివృద్ధి నిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత ఏడాదే మార్చిలోపే ఖర్చయిపోయాయి. దీంతో రోగులకు సరిపడా సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఉంది. అవసరమైతే మందులు కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది రోగులకు తగ్గ ఆసుపత్రుల అభివృద్ధి నిధులు రావాల్సి ఉంది.ఐదేళ్లుగా అందని దోమతెరలుఏజెన్సీలో 2021లో దోమతెరలు సరఫరా చేశారు. ఇప్పటి ఐదేళ్లు గడుస్తున్నా దోమతెరలు సరఫరా చేయలేదు. గత ఏడాదికే దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు 4.30లక్షల దోమతెరలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు..మలేరియా తగ్గుముఖానికి చర్యలు మలేరియా కేసులు మన్యంలో తగ్గించ డానికి చర్యలు తీసుకుం టున్నాం. స్ప్రేయిం గ్ ఆపరే షన్ చేయిస్తు న్నాం. ఇంటింటి సర్వే చేపడుతాం. ఎసిటి 3000 కిట్లు మందులు సిద్ధంగా ఉన్నాయి. మందులు కొరత లేదు. ఎస్.భాస్కరరావు,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, పార్వతీపురం.
