ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : తమ హక్కుల కోసంగత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఎంఎల్హెచ్పి, సిహెచ్వోలు హెల్త్ సూపర్వైజర ్లపైనా, ఎఎన్ఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వెంటనే వారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ జెఎసి నాయకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక ఎపి ఎన్జీవో హౌంలో జిల్లామెడికల్ అండ్ హెల్త్ జెఎసి సమావేశం ఎన్జీవో జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అనుచితంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వెంటనే క్షమాపణలు చెప్పాలి, జివో 143ను రద్దు చేయాలి, వెంటనే బదిలీలు చేపట్టాలని, పెండింగ్ ప్రొమోషన్స్ ఇవ్వాలని. యాప్లు తగ్గించాలని, ఫీల్డ్ స్టాఫ్ కి ఎఫ్ ఆర్ ఎస్ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు, వివిధ సంఘాల సభ్యులు బి చిన్నమ్మి. బి పుష్ప ఎన్ లలితకుమారి, జయలక్ష్మి, భవాని, కె.రాణి, జ్యోతి లక్ష్మి, దుర్గా ప్రసాద్, జయగౌడ్, పార్వతి, రవణమ్మ, జిల్లా వ్యాప్తంగా మెడికల్, హెల్త్ ఉద్యోగులు పాల్గొన్నారు.అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదు గరుగుబిల్లి : ఎంఎల్హెచ్పిలు తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని స్థానిక పిహెచ్సి వద్ద మంగళవారం ఎఎన్ఎంలు, సూపర్ వైజర్లు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ బి.చిన్నమ్మ మాట్లాడుతూ తమలాంటి ఉగ్యోగులను కించపర్చేలా సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈ నిరసన చేపడుతున్నామన్నారు. ఎంఎల్హెచ్పిలు తమ హక్కుల కోసం ధర్నా చేయడం తప్పుకాదని, కానీ మిగతా క్యాడర్లను కించపరిచేలా మాట్లాడడం సరైన పోరాటం కాదని అన్నారు. ఎఎన్ఎంలు, సూపర్వైజర్లు లక్షలాది రూపాలు వేతనాలు తీసుకుంటున్నారంటూ చేసిన వాక్యాలు తోటి ఉద్యోగస్తులను కించపరిచేలా ఉన్నాయన్నారు. తమ డిమాండ్లను సాధించుకొలా ఎంఎల్హెచ్పిలు పోరాటం చేయలే తప్ప ఇలా ఇతర ఉద్యోగులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఇకఫై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎస్. దుర్గాప్రసాద్, సిహెచ్ ఉదయకుమారి, ఎవి రవణమ్మ, ఎఎన్ఎంలు పాల్గొన్నారు.
