ఆశాలకు కనీస వేతనం అమలు చేయాలి

May 6,2025 21:31

ప్రజాశక్తి – మక్కువ : ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించి, కనీస వేతనం అమలు చేసి ,ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలని, 62 ఏళ్లకు రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని, రిటైర్‌ అవుతున్న వారికి బెనిఫిట్స్‌, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఆశా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మక్కువ, శంబర పిహెచ్‌సిల వైద్యాధికారులకు వినతి పత్రాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా మార్చాలని, ఆశాలతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌తో మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నాయకులు కె.లక్ష్మి, కె.సీత, బి.కామేశ్వరి, పి.జ్యోతి, ఎ.జానకి, ఎం.మంగ, ఎస్‌.విజయ, గౌరీ, కృష్ణవేణి, కృపారాణి, యశోద, మంజుల, సరోజిని, సిహెచ్‌డబ్ల్యు నాయకులు ఉషారాణి, లక్ష్మి, విజయలక్ష్మి, నవీన, రేవతి, నిర్మల, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ వై నాయుడు, మండల కార్యదర్శి జి.కృష్ణ పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సాలూరు మండల ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని యూనియన్‌ నాయకులు తెలిపారు. ఈ మేరకు మామిడిపల్లి, బాగువలస, తోణాం పిహెచ్‌సి ఆసుపత్రి వైద్యాధికారులకు సార్వత్రిక సమ్మె నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, రమణమ్మ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రశాంతి వరలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మర్రి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి ఎన్‌.నాయుడు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సహకరించాలని కోరుతూ ఎపి ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు పెదగొండపల్లి, బందలుపి, డోకి శిలా పీహెచ్సీ వైద్యాధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సీనియర్‌ నాయకులు శాంతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామంటూ స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారికి సిఐటియు ఆధ్వర్యాన ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ, రెడ్డి లక్ష్మి, టి.పార్వతి, పి.మంగమ్మ, సిహెచ్‌.శ్రావణి, గౌరమ్మ తదితర ఆశాలు పాల్గొన్నారు.కొమరాడ : మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. కొమరాడ, మాదలంగి, కూనేరు రామభద్రపురం పిహెచ్‌సిల వైద్యాధికారులకు సమ్మె నోటీస్‌ అందజేశారు. వినతిని అందజేసిన వారిలో ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, గంగ, హైమా, మంగ, పార్వతి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు నాయకులు దుర,్గ రాధ, మూడు పిహెచ్‌సిల్లో పని చేస్తున్న ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు పాల్గొన్నారు.సాలూరు: ఈనెల 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రక సమ్మెలో పాల్గొంటామని సాలూరు ఆశావర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు స్థానిక ఏరియా హాస్పిటల్‌ పిపి యూనిట్‌ అధికారికి సమ్మెనోటీసులను అందజేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు సంఘం నాయకులు రామలక్ష్మి, రాధా, అనిత, మాధవి, సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి, గోవిందమ్మ, అప్పలకొండ, సిఐటియు నాయకులు ఎన్‌వై.నాయుడు., తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : ఆశా వర్కర్ల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సహకరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ పాచిపెంట మండలం కమిటీ నాయకులు జలుమూరు చండీప్రియ, పి.మంజుల ఆధ్వర్యంలో పాచిపెంట పిహెచ్‌సి వైద్యాధికారి రవిచంద్రకు సమ్మె నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు అందజేత పార్వతీపురం టౌన్‌ : మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మిక, కర్షక సమ్మెలో పాల్గొంటామంటూ పారిశుధ్య రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు మున్సిపల్‌ శానిటరీ సూపర్వైజర్‌ రామారావుకు సమ్మెను నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ ఆప్కాస్‌ విధానాన్ని కొనసాగించాలని, రెగ్యులర్‌ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు, ఉద్యోగులకు నష్టం చేసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకులు ధరలు అదుపు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలనే డిమాండ్లతో మే 20న దేశ వ్యాప్త కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని ఆ సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని రంగాల కార్మికులు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకురు సూరిబాబు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు సింహాచలం, శంకరరావు, రవి, గంగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పాలకొండ కమిటీ స్థానిక నగర పంచాయతీ కమిషనర్‌ రత్నం రాజుకు సమ్మె నోటీసులు అందించారు. నోటీసును అందించిన వారిలో సిఐటియు మండల కార్యదర్శి కె.రాము, యూనియన్‌ కార్యదర్శి, కోశాధికారి టి.వేణు కార్యవర్గ సభ్యులు విమల, శ్రీదేవి తదితరులు ఉన్నారు.

➡️