మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించండి

May 6,2025 21:21

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గల కమిషనర్‌ ఛాంబర్‌కు వెళ్లి కమిషనర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆమె కమిషనర్‌తో మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించకపోవడం వల్ల ఎక్కడ బిల్లులు అక్కడే ఆగిపోయాయని, పట్టణంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఈ పద్ధతి సరికాదని వెం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని పార్టీలకు అతీతంగా వెంటనే నిర్వహించాలని అన్నారు. కమిషనర్‌ స్పందిస్తూ త్వరలోనే కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

➡️