ప్రజాశక్తి-కొమరాడ : మండలంలో కొట్టు, తొడుము గ్రామాల మధ్య రహదారిని బాగు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం గుంతలు ఏర్పడిన రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో కాలయాపన చేసి, పనులు చేయకుండా మోసగించారని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిటి రోడ్డు కోసం నిధులు మంజూరయ్యావని చెప్పి నెలలు గడుస్తున్నా నేటికీ ఒక్క రాయి కూడా వేయలేదని చెప్పారు. ఈ రహదారి అధ్వాన పరిస్థితిలో ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
