ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వినతులు అందజేశారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
