సారా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి

Apr 21,2025 21:35

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : సారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక దృష్టిసారించాలని డిఎస్‌పి రాంబాబు.. పోలీసు అధికారులను ఆదేశించారు. మండలంలోని ఎల్విన్‌పేట పోలీస్‌ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ప్రాంతంలో నాటుసారా వంటకాలు, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. యువత ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తే మొదటి తప్పుగా తల్లిదండ్రులను పిలిపించి, వారికి ఎదురుగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. మరలా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. లైసెన్సులు, వాహన పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేయాలని సూచించారు. లైసెన్స్‌ లేని వారికి, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చెప్పారు.పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు కురుపాం : నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డిఎస్‌పి రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో సిడి ఫైల్స్‌, రికార్డులు పరిశీలించారు. స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి గ్రీవెన్స్‌ విభాగం గూర్చి అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, నేర విభాగంలో ముద్దాయిలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. కార్యక్రమంలో సిఐ హరి, ఎస్‌ఐ నీలకంఠరావు పాల్గొన్నారు.

➡️