బొండపల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

May 11,2025 11:17 #Manyam District

నాయి బ్రాహ్మణవృత్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఘటన 
ప్రజాశక్తి-మక్కువ : ఐదు రోజులుగా వివాహాలలో బ్యాండ్ వాయించేందుకు వెళ్లి తిరిగి ఇంటి ముఖం పడుతుండగా విజయనగరం జిల్లా బొండపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయి బ్రాహ్మణు యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారు చోటుచేసుకుంది. మక్కువ గ్రామంలోని శ్రీదేవి కాలనీకి చెందిన తుమరాడ జానకిరామ్ అలియాస్ శ్రీను (21) వివాహ వేడుకలలో సన్నాయిమేళంలో పాల్గొంటూ వృత్తిని కొనసాగిస్తున్నాడు. విజయనగరం నుండి మక్కువ వస్తుండగా బొండపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీకొని అక్కడకు అక్కడే మృతి చెందాడు. ఇటీవలే జానకిరామ్ తండ్రీ కూడా చనిపోవడంతో తల్లి రమణమ్మ రోదన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది.

➡️