నరసరావుపేటలో కార్ల్మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న విజరుకుమార్ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమాజంలో దోపిడీ పీడన ఉన్నంత వరకూ ప్రపంచ పీడితవర్గాల మార్గదర్శి మార్క్సిజమేనని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో కార్ల్మార్క్స్ చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజి, విజరుకుమార్ మాట్లాడుతూ మార్క్స్ కంటే ముందు చాలామంది తత్వవేత్తలు సమాజం మారుతుందని చెప్పారని, కానీ ఏ విధంగా మారుతుందో గతితార్కిక పద్ధతిలో చెప్పిన తత్వవేత్త కారల్ మార్క్స్ మాత్రమేనని అన్నారు. పెట్టుబడిదారీవర్గం వద్ద సంపద ఏ విధంగా పోగుపడుతుందో అదనపు విలువ సిద్ధాంతం ద్వారా మార్క్స్ చెప్పానని, ప్రపంచంలో సంక్షోభాలు ఎలా వస్తాయో శాస్త్రీయంగా నిరూపించారని తెలిపారు. ఆయా సంక్షోభాల నుండి బయట పడటానికి పెట్టుబడిదారీ వర్గం నేడు కారల్మార్క్స్ రచించిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని విరివిరిగా అధ్యయం చేస్తున్నారన్నారు. మార్క్సిజాన్ని తమ దేశానికి అన్వయించి లెనిన్ రష్యాలో సోషలిజాన్ని తీసుకొచ్చారని, మార్క్స్ చెప్పింది ఆచరణలో సాధ్యమవుతుందని ప్రపంచానికి లెనిన్ నిరూపించాడని అన్నారు. సమాజంలో ప్రజలు దోపిడికి గురైనంత కాలం మార్క్సిజం అజేయంగా వుంటుందన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. జయించడానికి ప్రపంచం ఉంది.. అంటూ శ్రామిక వర్గానికి ఒక సిద్ధాంతాన్ని మార్క్స్ అందించారని కొనియాడారు. నేడు దేశంలో మితవాద శక్తులు నయా ఫాశిస్టు శక్తులు పాలిస్తున్న నేపత్యంలో మార్క్సిజం ప్రాధాన్యత మరింతగా పెరిగిందన్నారు. మార్క్సిజం సారాంశాన్ని ప్రజల్లోకి విరివిరిగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, కె.నళీనికాంత్, నాయకులు బి.ముత్యాలరావు, వై.కృష్ణకాంత్, ఎ.వి.వర్మ, వి.నారాయణ, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, ఎస్.ఆంజనేయులు నాయక్, జి.రవిబాబు, నాయకులు కె.రామారావు, డి.శివకుమారి, సిలార్ మసూద్, హనుమంతరెడ్డి, మల్లీశ్వరి, ఎఐటియుసి నాయకుల కె.రాంబాబు, రంగయ్య, వివిధ సంఘాల నాయకులు రెడ్ బాష, కె.కృష్ణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదనందిపాడు : మండలంలోని పాలపర్రులోని సిపిఎం కార్యాలయంలో కార్ల్మార్క్స్ జయంతి నిర్వహించారు. చిత్రపటానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు పూలమాలలేసి మాట్లాడారు. మార్సిజం ఆచరణలో సాధ్యం కానీ పిడి సూత్రమని పెట్టుబడిదారులు ప్రచారం చేశారని అయితే రష్టాలో లెనిన్ 1917లో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగా, 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టిందని, వియత్నాం, క్యూబా లాంటి దేశాలలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి, వీటికి మార్క్సిజమే ప్రాతిపదికని వివరించారు. ప్రపంచంలో 160 కోట్ల మంది కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్బాబు నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, జె.రామారావు, జి.హరిబాబు, పీటర్, జె.శంకర్రావు, ఎ.సుబ్బారావు టి.ప్రతాపరెడ్డి, డి.శ్రీనివాసరావు, ఎ.ఆశీర్వాదం, జె.రఘురాం, షమీ, సరళ, భువనేశ్వరి ఎం.లక్ష్మి, పి.సలీం పాల్గొన్నారు.
గుంటూరులో కార్ల్మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వై.నేతాజి తదితరులు
