ప్రజాశక్తి – ప్రకాశం : నేడు మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అనార్షియాతో కలిసి మినీ గోకుల షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రకమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు.