బిగ్‌ బాస్‌ బండారం మొత్తం బయటపెడతాం : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కుల్ని హరించి, అడ్డగోలుగా తప్పులు చేసిన వారు ఏదో ఒక రోజు చట్టం ముందు దోషిగా నిలబడడం తధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఐదేళ్ల అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతుండడంతో.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నరన్నారు. ఈస్కాములో ఉన్న అసలు బిగ్‌ బాస్‌ గుట్టు కూడా త్వరలోనే బయట పెడతాం అని. మద్యం స్కాం వెనుక చాలా మంది హస్తం ఉందని కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుండి చెబుతూనే ఉన్నాం అని గుర్తు చేశారు.ఇప్పటికే స్కాం వివరాలను శ్వేతపత్రం ద్వారా బయటపెట్టాం అని నిన్నటి వరకు వైసీపీలో నెం.2గా ఉన్న విజయసాయిరెడ్డి మద్యం స్కాం రాకెట్‌ మొత్తాన్ని బయటపెట్టడంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. ఇదే కేసులో రాజ్‌ కసిరెడ్డి అరెస్టయ్యారు. అయినా వైసీపీ నేతలు సిగ్గులేకుండా రాద్దాంతం చేస్తున్నరాన్నారు. అరెస్టులను రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని ఒక్కో ఇటుక పేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం అభివఅద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. పోలవరం, అమరావతి సహా నదుల అనుంసదానానికి నాడు శ్రీకారం చుడితే.. జగన్‌ రెడ్డి నిలిపివేశాడన్నారు. అమరావతికి కులం ముద్ర వేసి నాశనం చేయాలనుకున్నాడని. పోలవరంపై అవినీతి ఆరోపణలు చేసి విధ్వంసం చేశాడన్నారు అన్నీ నాశనం చేసి రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకున్నాడని దాన్ని ఏం చేయాలో అర్ధం కాని దుస్థితి నెలకొందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం నిర్మాణాలను వేగవంతం చేసిందన్నారు. వారి అసమర్థత కారణంగా నిర్మాణ వ్యయం 30 శాతం పెరిగిందన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ డీజీగా పని చేసిన వ్యక్తి చట్టాన్ని మీరి నాటి ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ముంబైకి చెందిన ఒక సినీ నటిని చిత్రహింసలు పెట్టారు. అధికారం ఉందని విర్రవీగితే చట్టం చూస్తూ ఊరుకోదు. సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్లను వదిలేయాలని వైసీపీ వారి ఆరాటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆడబిడ్డల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఎవరైనా ఒకటే. ఎవరినీ వదిలి పెట్టే ప్రశక్తే లేదన్నారు. కానీ.. జగన్‌ రెడ్డి మాత్రం టీడీపీ నేతలపై హత్యాయత్నం చేసినోడికి మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి, చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ, నిబద్దత. ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. ప్రజలు మెచ్చేలా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇలాంటి ప్రభుత్వంపై నిందలేయాలని, ఆరోపణలు చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఏపీలో సంవత్సరానికి రూ.33 వేల కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నాం. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రయత్నిస్తున్నాం. తాజాగా 16వేల టీచర్‌ పోస్టులతో డీఎస్సీ ప్రకటించాం. రాష్ట్రాన్ని సుభిక్షం చేసేందుకు కూటమి అడుగులు వేస్తోంది. ఐదేళ్లు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా డ్రామాలాడిన జగన్‌ రెడ్డికి ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలన్నారు.దొంగే దొంగ దొంగ అని అరచినట్లుగా పేర్నినాని వ్యవహారం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా దొక్కేసినోళ్లు ఎక్కడో ఏదో జరిగిపోతోందంటూ గోల చేస్తున్నాడు. ఎవరి హయాంలో మట్టి దోపిడీ జరిగిందో ప్రజల్ని అడిగేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. గోదాముల నిర్మాణానికి మట్టి ఎక్కడి నుండి తోలావో సమాధానం చెప్పాలన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూముల్ని అడ్డగోలుగా దోచుకుతిన్నవారు ఇప్పుడు నిందలేయడం హేయం. అన్నారు ఫిషింగ్‌ హార్బర్‌కు నిధులిచ్చింది మేము. బందరు పోర్టుకు భూ సేకరణ చేసి పనులు ప్రారంభించింది మేమే. విజయవాడ మచిలీపట్నం రోడ్డు నిర్మించింది మేమే. గత ఐదేళ్లలో అధికారుల్ని బెదిరించడం, ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. తప్పు చేసినోళ్లను వదిలిపెట్టే ప్రశక్తే లేదని హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లను సాకారంచేశాం. ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించేలా పనులు చేస్తున్నాం. అభివఅద్ధి చేసేవాళ్లపై బురద జల్లుతామంటే ప్రజలంతా ఏకమై తగిన ఫలితం చూపిస్తారని హెచ్చరించారు. మచిలీపట్నం సంస్కఅతిని చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రైనేజీలన్నింటిలో కూడా సిల్టు తొలగింపునకు టెండర్లు పిలిచాం. మురికి కాల్వల్ని శుభ్రం చేస్తాం. మున్సిపల్‌ కార్యాలయం, బేబీ సెంటర్‌, పాత రైతు బజార్‌ సీఎస్‌ఆర్‌, పిపిపి పద్దతిలో అభివఅద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. శ్మశాన వాటికల అభివఅద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చిలకలపూడి శ్మశానాన్ని అభివఅద్ధి చేసేందుకు గ్రీన్‌ కో సంస్థ ముందుకు వచ్చింది. ఇక్కడి నుండి వెళ్లి దేశ విదేశాల్లో స్థిరపడిన వారు కూడా సొంత ప్రాంత అభివఅద్ధికి ముందుకు రావడం అభినందనీయం. డంపింగ్‌ యార్డును పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో పార్కు ఏర్పాటు పనుల్ని అక్టోబర్‌ 2 నాటికి పూర్తి చేయబోతున్నాం. పి4 కార్యక్రమం ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్ధికంగా అభివఅద్ధి బాటలో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మచిలీపట్నం అభివఅద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములవ్వాలి. బందరుకు నయా రూపాన్ని సంతరించేందుకు తోడుగా నిలవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.

➡️