గ్రామాభివృద్ధే లక్ష్యం : మంత్రి సంధ్యారాణి

May 6,2025 21:37

ప్రజాశక్తి- మెంటాడ : గ్రామాభి వృద్ధే పభుత్వం లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. కొండలింగా లవలలో మంగళవారం గ్రామ సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె సొంత గ్రామం కావడంతో ప్రజలు సంతోషంగా డప్పులతో, పూలదండ లతో, ఊరేగింపులతో, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజలకు సులభంగా సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయాలను బలోపేతం చేస్తుందన్నారు. మంత్రి గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన భవనంతో గ్రామానికి మెరుగైన పాలన అందుతుందని మంత్రి తెలిపారు. టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, సీనియర్‌ పార్టీ నాయకులు గెద్ద అన్నవరం, గొర్లె ముసలినాయుడు, ఎంపిటిసి గుమ్మడి ప్రవీణ్‌ కుమార్‌, ఎంపిడిఒ భానుమూర్తి, చినప్పయ్య పాల్గొన్నారు.

➡️