ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండలంలోని బుర్రిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పి.కొండారత్నం, ఎం.త్రివేణి కుటుంబాలను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిస్థానిక నాయకులతో కలిసి ఆదివారం పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు సమకూర్చిన 30, 000/- రూపాయలు తన సొంత నిధులు 10, 000/- రూపాయలు, మొత్తంగా 40 వేల రూపాయలను బాధిత కుటుంబాలకు అందజేశారు. అలాగే నిరాశ్రయులైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇల్లు నిర్మించుకునేందుకు హౌసింగ్ లోన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ, రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పంతం గణపతి, గెడ్డం శివ, వారా రాము, మార్గాని ఏడుకొండలు, సత్తి వెంకటగిరి, కోమలి రామకృష్ణ, నూనె వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
