ప్రజాశక్తి -కోటవురట్ల : భూసార పరీక్షలతో మట్టిలో పోషకాల స్థాయి తెలుసుకొని అవసరమైన ఎరువుల మోతాదు నిర్ణయించుకోవడంతోపాటు పర్యావరణ కాలుష్యం నివారించుకోవచ్చునని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె.ఉమాప్రసాద్ సూచించారు. గురువారం రాజుపేట గ్రామంలో ఎస్ఐ శాఖ సిబ్బంది మట్టి నమూనా సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసార పరీక్షలతో రైతులకు పలు విధాలుగా లాభాలు చేకూరుతాయని, ఈ పరీక్షలు ధర ఎరువుల మోతాదులు, పంటల రకాల ఎంపికతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతుల గురించి రైతులందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు, నేలలో పోషకాలు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే పంటలు దిగుబడి ఆశించిన విధంగా వస్తుందన్నారు. ఏ విధమైన ఎరువులు వాడాలి అనే విషయం తెలుస్తుందని, దీని ద్వారా ఖర్చులు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు, ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో 50 మట్టి నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు సరోజిని, బిసిటి శాస్త్రవేత్తలు శైలజ, శ్రీహరి, ప్రసాద్ నాగేంద్ర ప్రసాద్ మరియు రైతు సేవ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది