ప్రజాశక్తి (సాలూరు) మన్యం : సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 6వవార్డు, కోటవీధి జంక్షన్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ డీటివి.కృష్ణారావు, మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ సిబ్బందితో కలిసి పారిశుద్ద్య పనులను మంగళవారం పరిశీలించారు. సాలూరు పట్టణంలో సంబంధించి కోటవీధి జంక్షన్, దగ్గర వీధుల్లో నీటి సరఫరాచేసే పైప్ లైన్లు బ్లాక్ అవ్వడంతో తాగునీటి సరఫరా లేనందున, అక్కడ ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ డిటివి.కృష్ణారావు, డిఈ.ప్రసాదరావు, శానిటరీ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ అక్కడికి వెళ్లి స్థానికలతో మాట్లాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే వాటర్ బ్లాక్ అయినవాటర్ పైపులైన్లలను క్లియర్ చేసి తక్షణమే నీటిసరఫరా అయ్యేటట్లుగా తగు చర్యలుచేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. శ్యామలాంబ అమ్మవారు పండుగ జరగనున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా శానిటరీ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ సిబ్బందితో శానిటేషన్ పనులు చేపట్టి, లారీఓనర్ యూనియన్ ఆఫీస్ వద్దనుండి గాంధీనగర్ బ్రిడ్జి ఎంట్రన్స్ వరకు ఇరుప్రక్కల పెరిగిన పిచ్చిమొక్కలు మట్టిదిబ్బలను జేసిబి సహాయంతో తొలగించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
