కనిగిరి (ప్రకాశం) : కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నాను చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ … సమ్మె కాలపు 16 రోజులకు వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ లో కొనసాగించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు వారాంతపు సెలవులను అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20 నుంచి నీరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ కు సమ్మె నోటీసును మున్సిపల్ కార్మికులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
