మురళి నాయక్‌ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం : పవన్ కల్యాణ్

పెనుకొండ (సత్యసాయి) : మురళి నాయక్‌ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం అని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ లో భాగంగా … జమ్మూ కాశ్మీర్‌ యుద్ధ భూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్‌ మృతి చెందారు. ఈ సందర్భంగా వీర జవానుకు పలువురు నేతలు నివాళులర్పించారు. ఎపి డిప్యూటి సిఎం శుక్రవారం పోస్టు పెడుతూ … ” ఆపరేషన్‌ సిందూర్‌ లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్‌ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్‌ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్‌ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం. ” అని పేర్కొన్నారు.

 

➡️