మండపేటలో ముస్లిం లు శాంతి ర్యాలి

Apr 25,2025 17:42 #konseema, #muslim

ప్రజాశక్తి – మండపేట : భారతీయ ముస్లిం లు అందరి లోనూ అణువణువునా భారతీయత నిండి ఉందని, ఇక్కడి ముస్లింలను ఉగ్రవాదులతో ముడి పెట్టి చూడవద్దని మండపేట పట్టణ ముస్లిం లు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు అనంతరం ముస్లిం ప్రతినిధులంతా శాంతి ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ నాయకులు ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ ఇస్లాం మారణకాండ కు పూర్తి వ్యతిరేకమన్నారు. పహల్గావ్ ఘటనకు పాల్పడిన వారిని అల్లా క్షమించడన్నారు. ఘటనలో మృతులకు అశ్రునివాంజలి ఘటించారు. తమకు దేశం మాత్రమే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణం లోని మసీదుల అధ్యక్షులు అల్తాఫ్, ఫారుఖ్ అలి, మౌలాలీ, అర్షి, జమాఅతె ఇస్లామీ జిల్లా అధ్యక్షులు అమిర్, షరీఫ్, ఏపిజె చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ మౌలానా, కరీం, హుస్సేన్, షహిద్, కమాల్, మస్జిద్ కమీటి సభ్యులు, జమాత్ ఇస్లామీ సభ్యులు ఆధిక సంఖ్యలో హిందు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

➡️