తృటిలో తప్పిన ప్రమాదం

Apr 22,2025 10:26 #Narrowly missed accident

ప్రజాశక్తి-కుప్పం రూరల్‌ (చిత్తూరు) : కుప్పం మండలం నాయనూరు గ్రామ పరిధిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. నాయనూరు గ్రామానికి చెందిన శివకుమార్‌ దంపతులు కుప్పం నుండి తమ గ్రామానికి బైక్‌ పై వెళుతుండగా మార్గమధ్యంలో అటవీ ప్రాంతం ఘాటు రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన ఇసుక టిప్పర్‌ ఢకొీన్నట్టు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందుకున్న డి.ఎస్‌.పి పార్థసారథి, పట్టణ సీఐ శంకరయ్య తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. మండలంలోని పెద్దవంక పాలారు నది నుండి హంద్రీనీవా కాలువ పనుల నిమిత్తం ఇసుకను పెద్ద ఎత్తున టిప్పర్ల సహాయంతో తరలించడం జరుగుతోందని, అసలే ఇరుకైన, మలుపులు గల రోడ్ల పై టిప్పర్‌ వాహనాల డ్రైవర్లు వాహనాలను వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని, అయితే చిన్న గాయాలతో బయటపడ్డాము కానీ, పెను ప్రమాదం సంభవించి ఉంటే పరిస్థితి ఊహించడానికి భయమేస్తుంది అంటూ బాధితులు డిఎస్పి కి వివరించారు. బాధితుల ఆవేదన అర్థం చేసుకున్న డిఎస్పి ఇసుక తరలిస్తున్న కాంట్రాక్టర్‌ ను, వాహన డ్రైవర్లను మందలించడంతో పాటు ప్రమాదానికి కారణమైన వాహనానికి సంబంధించిన పూర్తి ధ్రువపత్రాలతో పోలీసులను సంప్రదించాలని, తిరిగి ఇలాంటి ఘటనలు పునరావఅతం కాకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అలాగే వాహనాల ధ్రువపత్రాలను తనిఖీ చేసి, మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని గ్రామస్తులకు పోలీసులు భరోసా కల్పించారు.

➡️