కొండేపి (ప్రకాశం) : కొండేపి మండల ఆఫీసులో ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు కూరగాయలను స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కూరగాయలను తిన్నట్లయితే ఆరోగ్యకరముగా ఉంటాము ఇప్పుడు వచ్చే వ్యాధుల నుండి కొంతవరకైనా నివారించ కొనవచ్చును అలాగే మీ ఇంటి దగ్గర కూడా కిచెన్ గార్డెన్ వేసుకున్నట్లయితే ఇలాంటి ఆహారము తినవచ్చును అలాగే డబ్బు కూడా మీకు ఆదా అవుతుంది అని తెలియజేయడం జరిగినది కార్యక్రమమునకు ఎఒ విజరు కుమార్ విఎఎ శ్రీకాంత్ ఎస్హెచ్జి సభ్యులు, రైతులు వీటిని కొనుగోలు చేయడం జరిగినది. ఐసిఆర్పిఎస్ జోష్నా మాల కొండయ్య గౌతమి తిరుమల విజయలక్ష్మి పాల్గొనడం జరిగినది యూనిట్ ఇంచార్జ్ రంజిత్ కుమార్ గారు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వారి అందరికీ తెలియజేయడం జరిగినది.
