ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : ఈనెల 20న జరుగనున్న సమ్మెలో పాల్గొంటున్నామనిజిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస మూర్తికి, విజయనగరం మండల తహశీల్దార్ కూర్మనాథంకు విఆర్ఎలు గురువారం సమ్మె నోటీసు అందజేశారు.లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఖాళీలు భర్తీ, మూసి వేసిన పరిశ్రమలు తెరవాలని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.గురుమూర్తి, మండల గౌరవాధ్యక్షులు వి.ప్రసాద్ , సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు , మండల కార్యదర్శి రాజు, సభ్యులు భవాని తదితరులు పాల్గొన్నారు.ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె నోటీసుకార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని , ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, మేన్ డేస్ రద్దు చేయాలని ఈనెల 20న సమ్మెలో పాల్గొంటామని ఎంపిడిఒ పరిపాలన అధికారికి సమ్మె నోటీసు అందజేశారు. వీరిలో సిఐటియు నగర అధ్యక్షులు ఎ.జగన్మోహన్రావు, ఫీల్డు అసిస్టెంట్లు నాగమణి, సురేష్, పద్మావతి సోమేశు, ఈశ్వరమ్మ, భారతి, జ్యోతి ,రాజ్యలక్ష్మి, రామలక్ష్మి ఎర్రమ్మ, సాయి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమ్మె ఒప్పంద జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 20న సమ్మెలో పాల్గొంటున్నట్లు కమిషనర్ పి.నల్లనయ్యకు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి. భాస్కరరావు, ఎ.రజిని, బి.మోహన్, బి శంకర్రావు, బి. సూరి, పి పోలారావు, తదితరులు పాల్గొన్నారు
