ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులందే పైచేయి

Apr 24,2025 14:02 #ntr district

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ ఎస్ సి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థునులు పై చేయి సాధించారు. ఈ విద్యాలయంలో మల్లాది ప్రవల్లిక 572/600 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యాలయం నుంచి 82 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 81 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎపి మోడల్ స్కూల్ నుంచి 59 మంది పరీక్షకు హాజరవగా మంది51 ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ విద్యార్థి 545 ఎక్కువ మార్కులు సాధించారు. కూనపరాజుపర్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 26మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ అధికంగా విద్యార్థి 508 మార్కులు సాధించారు. కుదప జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 9 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 6 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నాగులూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి మంద 73 విద్యార్థులు పరీక్షకు హాజరవగా 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 49 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా మంది విద్యార్థులు 33 ఉత్తీర్ణత సాధించారని ఎంఇఓ రమేష్ తెలిపారు.

➡️