ప్రజాశక్తి- నందిగామ : జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్ర ముకలు, ఉగ్రవాదులు దాడి నిరసిస్తూ నందిగామలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. భారతీయుల అమాయక పర్యాటకులను, ప్రజలను నిర్ధాక్షణంగా కాల్చి చంపటాన్ని న్యాయవాదులు ఖండించారు. అమాయక ప్రజల ప్రాణాలపై జరిగిన దాడిని ఖండిస్తూ, మానవత్వానికి మచ్చగా, ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ జరగకుండా చూడాలని కోరారు. దేశ సమగ్రత సమైక్యతను కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టమైన భద్రతను దేశ ప్రజలకు కల్పించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన మృతుల ఒక్కొక్కరి కుటుంబాలకు తక్షణం కోటి రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి ఘనమైన నివాళులు అర్పించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ న్యాయవాదులు ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ జనరల్ సెక్రెటరీ అద్దంకి మణిబాబు, జాయింట్ సెక్రెటరీ ఉప్పులూరి డేవిడ్ రాజ్, ట్రెజరర్ స్టాలిన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాస్తాల చరణ్ సీనియర్ న్యాయవాదులు కన్నెగంటి జీవరత్నం, కొనకంచి శ్రీనివాసరావు చెరుకుమల్లి రామారావు, మంద వజ్రయ్య, కొరగంటి ఆదాము, చాపల శివరామకృష్ణ, బొబ్బిళ్ళ పాటి భాస్కరరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎక్కిరాల హనుమంతరావు, గుడిసె సుమన్, ఎం కొండలరావు. షేక్ సైదా, బొలుసుపాటి సురేష్, కొమ్మినేని మౌళేశ్వరరావు, తాడేపల్లి కాంతారావు, ముల్లపాటి అశోక్, జిల్లేపల్లి రంగారావు, యర్ర గొర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
