ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం (చిత్తూరు) : చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎస్ఆర్ పురం మండలం, అంబర మహారాజపురం పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లి ఉపాధి హామీ శ్రామికులను తేనెటీగలు కుట్టడంతో అడిషనల్ పిడి మల్లికార్జున, ఎంపీడీవో మోహన మురళి, ఏపీఓ లలిత వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలను పరామర్శించి స్థితిగతులు తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కూలీలపై పెద్ద తేనెటీగలు దాడి – ఇద్దరి పరిస్థితి విషమం