ప్రజాశక్తి-రావులపాలెం (కోనసీమ) : సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని అమ్మను అందరూ ఆరాధ్యదైవంగా పూజించాలని మినీ అంగన్వాడీ కార్యకర్త సంకు శ్రీలక్ష్మి అన్నారు. మండల పరిధి పొడగట్లపల్లి లక్ష్మీపాలెం లో శనివారం కొత్తపేట ఐసీడీఎస్ సీడీపీఓ ఏ.గజలక్ష్మి ఆదేశాలు మేరకు సూపర్ వైజర్ నాగసత్యవేణి పర్యవేక్షణలో కార్యకర్త శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో మదర్స్ డే ను ఒకరోజు ముందు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులందరూ తమ తల్లులకు కాళ్లు కడిగి పాదపూజ చేసి అశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మినీ అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ప్రతి బిడ్డ తొలి పలుకే అమృతం లాంటి పదం అమ్మ అని తెలియజేశారు. అమ్మ లేకుంటే ఈ సృష్టే లేదని, ప్రేమమూర్తి లాంటి అమ్మ రుణాన్ని ఎన్నటికి తీర్చుకోలేనిదన్నారు. జీవితంలో తొలి గురువుగా భావించే తల్లిని అందరూ ఎల్లప్పుడు గౌరవించి అమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లులు, ప్రీస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
