కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ది : కాకినాడ ఎంపి అభ్యర్థి పళ్లంరాజు

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే అభివఅద్ధి చెందుతుందని కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు అన్నారు. మండల కేంద్రమైన జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మరోతి శివ గణేష్‌ తో ఆయన జగ్గంపేట లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ తోనే సాధ్యమని, జాతీయ స్థాయిలో పంచ న్యాయాలు పేరుతో 25 గ్యారంటీలు, రాష్ట్రంలో మరో 9 గ్యారెంటీలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు మేలు చేసే దానికి మేనిఫెస్టో రూపొందించిందని, ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.8,333 అందిస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఉద్యోగ యువతకు 30 లక్షలు ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని, ఉపాధి కూలీలు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తామని, వఅద్ధులకు నాలుగు వేల రూపాయలు, వికలాంగులకు రూ.6,000 పెన్షన్‌ అమలు చేస్తామని మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వత్సవాయి సత్యనారాయణ రాజు అనే బాబు, డాక్టర్‌ నక్క సత్యనారాయణ, చంద్రమౌళి వెంకటరత్నం అనే చిన్నారి.బొల్లం బాపిరాజు, కొండా శ్రీను, కటే జయ వందల సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️