పావని చంద్రికకు స్వీట్‌ తినిపిస్తున్న పల్నాడు డిఇఒ ఎల్‌.చంద్రకళ

Apr 23,2025 23:58

రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఒప్పిచర్ల జెడ్‌పి విద్యార్థిని పావని చంద్రిక
ప్రజాశక్తి – కారంపూడి :
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పల్నాడు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. కారంపూడి మండలం ఒప్పిచర్ల జెడ్‌పి పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. పావని చంద్రికను పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబుతోపాటు డిఇఒ ఎల్‌.చంద్రకళ, హెచ్‌ఎం విజయలలిత అభినందించారు.

➡️