పారిశుధ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

May 5,2025 16:20 #Kurnool

ప్రజాశక్తి :ఎమ్మిగనూరు : పారిశుధ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మునిసిపల్ కమీషనర్ ఎన్ గంగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సోమప్ప సర్కిల్, పార్క్ రోడ్డు , మార్కెట్ ఏరియా నందు పారిశుధ్య పనులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను రోడ్ల పైన, మురికి కాల్వాలలో వెయ్యరాదని పేర్కొన్నారు. అలాగే అన్న క్యాంటీన్ నందు అల్పాహారం పంపిణీ తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ప్రజలకు నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. శుభ్రతను పాటించాలని సూచించారు.

➡️