ఆధార్‌ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : మండలంలో ఏర్పాటు చేస్తున్న ఆధార్‌ ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రజలు తమ ఆధార్‌ కార్డులకు అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవచ్చని ఎంపీడీవో వి వి వి ఎస్‌ రామారావు బుధవారం తెలిపారు. ముఖ్యంగా 5 నుండి 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు బయోమెట్రిక్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాంపులలో బాలా ధార్‌, మొబైల్‌ నెంబర్ల నమోదు, మార్పులు, ప్రజలకు అవసరమైన చిరునామాల మార్పిడి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక క్యాంపులు గురువారం ఉండ్రాజవరం, దమ్మెన్ను, సోమ, మంగళ వారాలు సత్యవాడ, తాడిపర్రు, బుధ గురు వారాలు పాలంగి, సూర్యారావు పాలెం గ్రామాల సచివాలయాల లో నిర్వహిస్తారు. ప్రతి నెలలో తప్పనిసరిగా ఏర్పాటు చేసే ఆధార్‌ ప్రత్యేక కాంపుల లో డిజిటల్‌ అసిస్టెంట్‌ లు కె రామాంజనేయులు, డి సతీష్‌, తదితర సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

➡️