ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ అకాడమికి నిధులు మంజూరు అయినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడి విభాగం ఏపీ ఏ డి సి ఎల్ ఆధ్వర్యంలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కి కనెక్ట్ చేసే టాక్సీవేని అందించడం కోసం రూ. 2.27 కోట్లు మంజూరు చేసి పరిపాలనా అనుమతి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. తాను విన్నవించడంతో కేంద్ర విమానాయశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ నిధుల నుంచి కేంద్ర ఫౌర విమానాశ్రయం మంత్రి కె. రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేశారని ఆమె చెప్పారు.
