కార్మికుల ఆటో బోల్తా.. 34 మందికి గాయాలు

ప్రజాశక్తి-పొన్నలూరు (ప్రకాశం జిల్లా) : కార్మికులతో వెళుతున్న ఆటో బోల్తా పడిన ఘటనలో 34 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పొన్నలూరులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరుకు చెందిన 34 మంది కార్మికులు పొగాకు గ్రేడింగ్‌ కోసం రెడ్డిపాలెంకు ఆటోలో వెళ్తున్నారు. పొన్నలూరులోని తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్మికులంతా చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కువ మంది కూలీలను ఆటోలలో ఎక్కించడం వల్లే ఆటో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.

➡️