గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

Apr 21,2025 21:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని ఎంపిడిఒ జి.పైడితల్లి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ అధికారులు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంపిడిఒ పైడితల్లి మాట్లాడారు. కొమరాడ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి, ప్రధానోపాధ్యాయులు ఎస్‌ ఎల్‌ పాత్రుడు, గరుగుబిల్లి, రావివలస ఐసిడిఎస్‌ సెక్టార్ల సూపర్వైజర్లు రౌతు లక్ష్మి, అరుణకుమారి, అంగన్వాడీ వర్కర్లు ఎం.సావిత్రి, పల్ల కృష్ణవేణి, మహంతి పద్మావతి, మూడడ్ల స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

భామిని : గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించే బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందని సిడిపిఒ శాంతిభవాని అన్నారు. బిల్లుమడ గ్రామంలో సిడిపిఒ ఆధ్వర్యంలో సోమవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న పోషకాలు కలిగి ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, వాటిలో ఉండే పోషకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ జ్యోతి లక్ష్మి, బిపి సి వరలక్ష్మి, సౌజన్య పాల్గొన్నారు.

➡️