ప్రజాశక్తి- చీరాల (బాపట్ల) : చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా రంగంలోనూ రాణించడం పాఠశాలకై గాక జిల్లా కై గర్వకారణమని ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ బి.అశోక్ బాబు అన్నారు.జాతీయస్థాయి లాక్రోస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచారన్నారు.ఫలితంగా ఆంధ్రజట్టు మూడోవ స్థానంలో నిలిచిందన్నారు.ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆగ్రాలో జాతీయ స్థాయి లాక్రోస్ పోటీలు జరిగాయన్నారు.పోటీలలో దేశంలోని 24 రాష్ట్రాలకు సంబందించిన జట్ల క్రీడాకారులు పాల్గన్నట్లు తెలిపారు.ఆయా జట్లు క్యాటగిరిల వారీగా సబ్ జూనియర్ బార్సు, సబ్ జూనియర్ గర్ల్స్, జూనియర్ బార్సు, జూనియర్ గర్ల్స్, సీనియర్ బార్సు,సీనియర్ గర్ల్స్ విభాగాలలో పోటాపోటీగా తలపడగా,,అన్ని విభాగాలలో విశేష ప్రతిభ చూపిన ఆంద్రప్రదేశ్ జట్టు క్రీడాకారులు తఅతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు . పోటీలలో మొదటి రెండు స్థానాలలో రాజస్థాన్, హర్యానా జట్లు నిలిచినట్లు ఏపీ లాక్రోస్ సెక్రటరీ సురేంద్రబాబు తెలిపారు. గత ఏడాది ఇదే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రజట్టు మొదటి స్థానంలో నిలిచినా విషయాన్ని అయన ఈసందర్భంగా గుర్తుచేశారు.ఈసందర్భంగా పాటశాల ప్రిన్సిపాల్ అశోక్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో పాటశాల విద్యారులు రాణించడం అబినందనీయమన్నారు .ఇటీవలే ”లాక్రోస్” క్రీడా ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలతో కొంతమేర ప్రయెజనం చేకూరుతుందన్నారు .మరీముఖ్యంగా ఆంధ్రజట్టులో తమ పాఠశాల విద్యార్థులై 10 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించడం తమ పాటశాలలో క్రీడలకు ఇస్తున్న ప్రాధ్యానతను చెప్పకనే చేపవచ్చునన్నారు .అంతేకాకుండా ఆయా జట్లలో విశేష ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేసే క్రమంలో తమ పాఠశాల విద్యార్థులు సైతం ఇద్దరు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు .
