ప్రజాశక్తి – కర్లపాలెం (బాపట్ల) : బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైసిపి నాయకుడు బి.ఎస్.ఆర్ యాదవ్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈరోజు సాయంత్రానికి ఆయన భౌతిక ఖాయం హైదరాబాద్ నుంచి బుద్దాంకు చేరుకునే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
