ఆర్డీ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి : ఏపీ యన్‌ జి జి వో నాయకులు

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : వైద్య ఆరోగ్యశాఖ ఆర్డి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్జీజీవో నాయకులు కోరారు. శుక్రవారం కడప రీజినల్‌ డైరెక్టర్‌ గా వచ్చిన డాక్టర్‌ బి. రామగిడ్డయ్య ను కడప జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్ర శేఖర్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ప్రసాద్‌ యాదవ్‌, మాధవ్‌, జిల్లా కార్యదర్శి డి.రవికుమార్‌, డి.చంద్రమోహన్‌, జిల్లా మహిళ కన్వీనర్‌ జమీలా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ లో 30 సంవత్సరాల నుంచి ఏ యన్‌ యం గా పనిచేస్తున్న ఇంతవరకు పదోన్నతుల కల్పించలేదని తెలిపారు. ఇప్పుడు కడప రీజియన్‌ పరిధి లోని అన్ని సూపెర్వైసర్‌ ఫిమేల్‌ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేయాలని కోరారు. కడప రీజియన్‌ పరిధిలోని అన్ని క్యాడర్స్‌ పి యచ్‌ యన్‌, యం పి ఎచ్‌ ఈ వో, ఫార్మసీ సూపరవైసర్‌ పదహౌన్నతలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం పై స్పందించిన ఆర్‌ డి డాక్టర్‌ రామగిడ్డయ్య త్వరలో సీనియార్టీ జాబితా సిద్ధం చేసి ఇస్తానన్నారు. కార్యక్రమంలో అనంతపురం, కడప ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️