ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ‘తొలగని ట్రాఫిక్ కష్టాలు’ అనే శీర్షికతో మంగళవారం ప్రజాశక్తి పత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తపై నగిరి డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ స్పందించారు. పచ్చికాపల్లంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం బుధవారం మహాభారతం ప్రాంగణంలో వ్యాపారస్తులతో , స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం దుకాణాల యజమానుల సహకారం అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్సై వెంకటసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి సాయి భవాని, స్థానికులు ఉన్నారు.
