నంద్యాల అర్బన్ : నంద్యాల 39వ వార్డు రోజాకుంటలో నివాసముంటున్న ఆర్టిసి రిటైర్డ్ ఉద్యోగి కొమరోలు యంగన్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన టిడిపి 39వ వార్డు ఇన్చార్జి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు కె.ఆదినారాయణ, అల్లామాలిక్ జాకీర్, తదితరులు కలిసి శుక్రవారం ఉదయం యంగన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.