ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు వి.థామస్ ఆదేశాల మేరకు వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి పంచాయతీ కేంద్రంలోని శ్రీరాముల ఆలయం మందిరంలో శుక్రవారం వెదురుకుప్పం తాసిల్దార్ రమేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీకి చెందిన గంగాధర్ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు, పంచాయతీ ఇంచార్జి పోటుగారి గంగయ్య అలాగే చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బండిలోకేష్ రెడ్డి కొర్లకుంట భాస్కర్ రెడ్డి, మొండిగనపల్లి పంచాయతీకి చెందిన పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.