వీడియో కాన్ఫర్స్ ద్వారా శిక్షణలో పాల్గొన్న కలెక్టర్, ఇతర అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై న్యూడిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణిచ్చారు. ఇందులో భాగంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పటిష్టంగా చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, సహాయక రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి అధికారులు పాల్గొన్నారు.
