చీమకుర్తి (ప్రకాశం) : రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లాలో జరిగింది. చీమకుర్తిలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పీవి రామిరెడ్డి తన విధులు ముగించుకుని పేర్నమిట్టలోని తన ఇంటికి వెళుతున్న సమయంలో సంతనూతలపాడు చెరువుకట్ట సమీపంలోని రోడ్డు స్పీడ్ బ్రేకర్ వద్ద లోడులో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
