ప్రజాశక్తి-దర్శి: రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కురిచేడు రోడ్డులోని తిరుపతిరెడ్డి షాపు వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరుగురు వికలాంగులకు వీల్చైర్లు, ఇద్దరికి కుట్టు మిషన్లు అందజేసినట్లు రోటరీ క్లబ్ నాయకుడు స్థానిక తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు పేదలకు రూ.60 వేల విలువైన కుట్టు మిషన్లు, వీల్ చైర్లు ఇవ్వడం పట్ల అభినందించారు. సిఐ వై.రామారావు చేతుల మీదుగా కుట్టుమిషన్లు, వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.కోటేశ్వరరావు, అమ్మవరపు నారాయణరెడ్డి, సభ్యులు పేర్రెడ్డి సోము, దుర్గారెడ్డి, మారం శివకోటిరెడ్డి, మాస్టర్ శ్రీనివాసులు, మారం సత్యనారాయణరెడ్డి, ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
