దుకాణాల్లో తనిఖీ చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని పురుగు మందులు, ఎరువులు దుకాణాల్లో మంగళవారం తనిఖీలు చేపట్టిన అధికారులు రూ.68 లక్షల 77 వేల 537 విలువైన సరుకున సీజ్ చేశారు. అనుమతులు లేని బయో ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇన్ఛార్జి ఎడిఎ రవికుమార్ తెలిపారు. తనిఖీల్లో ఐదు మండలాల అధికారులైన అంకారావు, అంజిరెడ్డి, రామారావు, సుగుణ బేగం, ప్రవీణ పాల్గొన్నారు.
