సమావేశంలో మాట్లాడుతున్న పీడీ ఝాన్సీరాణి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాలకు అనుగుణంగా, వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సిబ్బంది కృషి చేయాలని డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి అన్నారు.స్వయం సహాయక సంఘాలకు వార్షిక రుణాలు, వసూళ్లు తదితర అంశాలపై ఎపిఎంలకు, సిసిలకు నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో గురువారం శిక్షణిచ్చారు. జిల్లాలో 36500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, మండల స్థాయిలో గ్రామ సమాఖ్య అధ్యక్షులకు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్లకు శిక్షణిచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవనోపాధులు పెంపొందిం చేందుకు రుణం ఎంత కావాలో క్రెడిట్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. దీని ఆధారంగా బ్యాంకు లింకేజ్, స్త్రీ నిధి, ఉన్నతి, పొదుపు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రమణారెడ్డి, డిపిఎంలు, స్త్రీ నిధి ఎజిఎం పాల్గొన్నారు.
