ప్రజలకు మెరుగైన సేవలందించండి

May 10,2025 20:57

విస్తృత సమావేశంలో టిడిపి నాయకులు పిలుపు

ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడం, మరియు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. టిడిపి జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం బొబ్బిలిలో జరిగింది. ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, బేబీ నాయన, జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో పాటు జిల్లా టిడిపి నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా జమ్మూ కాశ్మీర్‌లో దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన మన రాష్ట్రానికి చెందిన జవాన్‌ మురళినాయక్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు, అనంతరం సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టిడిపి సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగే పార్టీ కమిటీల నియామకంలో సమన్వయంతో పనిచేయాలని, బూత్‌ ఇంచార్జ్‌, కో ఇన్‌ఛార్జి నియామకం, గ్రామ,డివిజన్‌ కమిటీల నియామకం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కోరారు. కొత్త రేషన్‌ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు.

➡️